హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ)ః పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించాలని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా విద్యార్థుల కోసం గాంధీ చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించడానికి సహకరించిన తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు సునీల్నారంగ్, కార్యదర్శి అనుపమ్రెడ్డి, తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బసిరెడ్డి, కార్యదర్శి దామోదర్ప్రసాద్, క్యూబ్, యూఎఫ్వో, పీఎస్డీ డిజిటల్ సర్వీస్ ప్రతినిధులను శనివారం మంత్రి తలసాని తన చాంబర్లో సన్మానించారు.
మంత్రి మాట్లాడుతూ.. ఈ నెల 8 నుంచి 22 వరకు 552 స్రీన్లలో గాంధీ సినిమాను ప్రదర్శించగా, 22.57 లక్షల మంది విద్యార్థులు వీక్షించారని తెలిపారు. కార్యక్రమంలో ఎఫ్డీసీ చైర్మన్ అనిల్కుమార్ కూర్మాచలం, సీఎస్ సోమేశ్కుమార్, ఎఫ్డీసీ ఎండీ, ఎస్సీఎస్ అర్వింద్కుమార్, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవిగుప్తా, ఎఫ్డీసీ ఈడీ కిషోర్బాబు, సమాచార పౌరసంబంధాల డైరెక్టర్ రాజమౌళి పాల్గొన్నారు.