హైదరాబాద్ : మాజీ ప్రధాని పీవీకి భారతరత్న ఇవ్వాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పీవీ జయంతి సందర్భంగా నెక్లెస్ రోడ్లోని పీవీ ఘాట్లో మంత్రులు మహమూద్ అలీ, మల్లారెడ్డితో కలిసి ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ప్రధాని, తెలుగు బిడ్డ పీవీని కేంద్రం విస్మరించడం బాధాకరమన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న దేశాన్ని ఆర్థిక సంస్కరణలతో అభివృద్ధిలోకి తీసుకువచ్చిన పీవీకి భారత రత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. పీవీ శతజయంతి సందర్భంగా ఏడాది పొడవునా వేడుకలు నిర్వహించి తెలంగాణ ప్రభుత్వం గౌరవించిందన్నారు. మన మధ్య భౌతికంగా లేకపోయిన మన గుండెల్లో చిరస్థాయిగా నిలిచే గొప్ప వ్యక్తి అన్నారు.