హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 18 (నమస్తే తెలంగాణ): మహాత్మాగాంధీ అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్రం తెస్తే.. కేంద్రంలోని బీజేపీ మాత్రం హింసావాదాన్ని ప్రోత్సహిస్తున్నదని పశుసంవర్ధక, శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు, విధానాలతో ప్రపంచం ముందు దేశం పరువు పోతున్నదని అన్నారు. లండన్ పర్యటనలో ఉన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో శుక్రవారం జరిగిన ఘటనపై ఆ నగరంలోని మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. ఈ ఘటనలో మృతి చెందిన రాకేశ్ కుటుంబ సభ్యులకు మంత్రి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.