హైదరాబాద్ : రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్పై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నిప్పులు చెరిగారు. గణతంత్ర దినోత్సవంలో రాజకీయాలు మాట్లాడటం తగదు అని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం పట్ల గవర్నర్ తమిళిసై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తలసాని శ్రీనివాస్ యాదవ్ తప్పుబట్టారు.
రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతినేలా గవర్నర్ మాట్లాడారని తలసాని పేర్కొన్నారు. గవర్నర్ వైఖరిపై త్వరలోనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాస్తామని చెప్పారు. గవర్నర్ విషయంలో రాష్ట్రపతి కల్పించుకోవాలన్నారు. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉంటూ ఓ పార్టీ కి అనుకూలంగా వ్యవహరించడం సరైంది కాదన్నారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును రాజకీయాలకు ఉపయోగించడం తగదు అని తలసాని శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు.