హైదరాబాద్ : ఈ దేశ రాజకీయాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభావితం చేస్తారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ… కేసీఆర్ విజనరీ నాయకుడు. రాష్ట్రం సాధించడమే కాకుండా.. తెలంగాణను నంబర్ వన్ చేశారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు అద్భుతంగా అమలవుతున్నాయి. అద్భుతాలు సృష్టించారు. కేంద్రం అనేక అవార్డులు ఇచ్చింది. తెలంగాణ మాదిరిగానే భారతదేశాన్ని అభివృద్ధి చేస్తాం. ఈ మోడల్ను దేశమంతా అమలు చేస్తాం. ఇండియన్ సిటిజన్గా దేశ రాజకీయాలను ప్రభావితం చేయబోతున్నాం.. చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.