సికింద్రాబాద్: నగరంలోని బన్సీలాల్పేటలో డబుల్ బెడ్రూం ఇళ్ల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక్కడి ఇళ్ల నిర్మాణ పనులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వయంగా పరిశీలించారు. పనులు ఎలా జరుగుతుందీ అధికారులు ఆయనకు వివరించారు.
పనితీరుపై మంత్రి తలసాని సంతృప్తి వ్యక్తం చేశారు. దీపావళి పండుగ నాటికి ఈ ఇళ్లలో గృహప్రవేశాలు జరుగుతాయని చెప్పారు. కాగా, ఇప్పటికే రాష్ట్రంలో పలుచోట్ల డబుల్ బెడ్రూం ఇళ్ల పనులు పూర్తయిన సంగతి తెలిసిందే. ఈ పథకంపై ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిందని అధికార పార్టీ వర్గాలు చెప్తున్నాయి.