హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): తనకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)నుంచి నోటీసులు వచ్చినట్టు జరుగుతున్న ప్రచారాన్ని తలసాని సాయి కిరణ్ ఖండించారు. తనకెలాంటి నోటీసులు అందలేదని స్పష్టం చేశారు. ‘ ఈడీ నుంచి నాకు ఎలాంటి నోటీసులు రాలేదు.
నోటీసులు ఇచ్చేందుకు ఎవరూ ప్రయత్నించలేదు. నిజానిజాలు తెలుసుకొని వార్తలు వేయాలని మీడియాను కోరుతున్నా. యువ నాయకుడిగా నేను ప్రజలకు సేవ చేసేందుకు కృషి చేస్తున్నా’ అంటూ ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. క్యాసినో కేసులో ఈడీ తలసాని సాయి కిరణ్కు నోటీసులు ఇచ్చినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.