హైదరాబాద్ : సీఎం కేసీఆర్ వెంటే తెలంగాణ రైతన్నలు ఉంటారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం బన్సీలాల్పేటలో పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే వ్యవసాయానికి 24 గంటల పాటు విద్యుత్ అందుతందున్నారు. అలాగే సకాలంలో పంట పెట్టుబడి సాయం, రైతు బీమా, విత్తనాలు, ఎరువుల అందిస్తున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ అని స్పష్టం చేశారు.
వ్యవసాయానికి 3 గంటల విద్యుత్ చాలు అని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి మాట్లాడటం అతని అవివేకానికి నిదర్శనం అన్నారు. ప్రజలను తప్పిదారి పట్టించేందుకే ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అర్ధరహిత విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
వ్యక్తిగత విమర్శలు తగవని హితవు పలికారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు వారి కండ్లకు కనిపిస్తలేవా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం అందించిన అవార్డులే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం అన్నారు. ముందు మీ ఇల్లు చక్కదిద్దుకోండి..మీ రాష్ట్రంలో పరిస్థితులు బాగాలేవు. ఒళ్లు దగ్గర పెట్టుకొని ప్రవర్తించాలని ఘాటుగా విమర్శించారు.