హైదరాబాద్ : అనుమానమే లేదు..78 స్థానాల్లో గెలుస్తాం..మళ్ళీ అధికారంలోకి వస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani )అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం సనత్నగర్ నియోజకవర్గంలోని మొండా డివిజన్ సాంబమూర్తి నగర్, ఆదయ్య నగర్, గ్యాస్ మండిలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ఇంటికి వెళ్లి ఓటు అభ్యర్థించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరిగాయి. గ్రేటర్లో అన్ని స్థానాలలో బీఆర్ఎస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. చేసిన పనిని చెబుతాతం. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్దామని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు. మంత్రి వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.