హైదరాబాద్ : దేశంలోనే అత్యుత్తమ నివాస యోగ్యమైన నగరం హైదరాబాద్ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సనత్నగర్ నియెజకవర్గంలోని అపార్ట్మెంట్ వాసులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ విశ్వనగరంగా మారిందన్నారు. మహానగరంలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు ఎంతో అభివృద్ధి చెందాయి.
మరో 100 సంవత్సరాల వరకు నగర ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా కృష్ణా, గోదావరి జలాల తర లిస్తున్నామని చెప్పారు. నూతన ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణంతో ట్రాఫిక్ సమస్యను పరిష్క రిస్తున్నామని పేర్కొన్నారు. SNDP కార్యక్రమంతో పూర్తిస్థాయిలో నాలాల అభివృద్ధి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కరోనా సమయంలో కూడా అభివృద్ధి పనులు కొనసాగాయన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటేసి గెలిపించాలన్నారు.