హైదరాబాద్ : ముస్లింల పవ్రిత రంజాన్ పండుగ సందర్భంగా రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) శుభాకాంక్షలు తెలిపారు. శనివారం సనత్నగర్(Sanath nagar) లోని వెల్ఫేర్ సెంటర్ గ్రౌండ్ లో వేలాది మంది ముస్లింలు నిర్వహించిన సామూహిక ప్రార్ధన(Mass Prayers) లలో మంత్రి పాల్గొన్నారు. ప్రార్ధనల అనంతరం ముస్లింలను ఆలింగనం చేసుకొని ఈద్ ముబారక్ తెలిపారు.
మత సామరస్యానికి ప్రతీక రంజాన్ (Ramzan) అని, నెల రోజుల పాటు ఎంతో నిష్ఠతో ఉపవాస దీక్షలు చేస్తారని మంత్రి పేర్కొన్నారు. పండుగను సంతోషంగా జరుపుకోవాలని, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(CM KCR) ఆదేశాల మేరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సనత్ నగర్ డివిజన్ బీఆర్ఎస్ (BRS) అధ్యక్షులు కొలన్ బాల్ రెడ్డి, నాయకులు సరాఫ్ సంతోష్ ఖలీల్, రాజేశ్, జమీర్ తదితరులు పాల్గొన్నారు.