హైదరాబాద్ : అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం సహకరించడం లేదని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani) అన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధిపై చర్యకు సిద్ధమా అంటూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతలకు సవాలు విసిరారు.
ఆదివారం అంబర్ పేట నియోజకవర్గ పరిధిలోని గోల్నాక డివిజన్ బీఆర్ఎస్(BRS) ఆత్మీయ సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు.అంబర్ పేట ఎమ్మెల్యే( MLA )గా 15 సంవత్సరాలు, ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి అంబర్ పేట కు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలో కేసీఆర్(KCR) ను ఢీ కొట్టగల నాయకుడు లేరని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం పై విమర్శలు మాని ఢిల్లీ నుంచి నిధులు తీసుకువచ్చే దమ్ము బీజేపీ(BJP) నాయకులకు ఉందా?అని ప్రశ్నించారు. మతాలు, కులాల పేరుతో రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నాయని బీజేపీపై మండిపడ్డారు.అంబర్పేట్లో ఎమ్మెల్యే (MLA) గా ఒడినందునే కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి అయ్యారని ఎద్దేవా చేశారు.