హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ పండుగ సోదర సోదరీమణుల ఆత్మీయతకు, అనురాగానికి ప్రతీకగా నిలుస్తుందని చెప్పారు. భారతీయ సంస్కృతిలో అనుబంధాలకు ప్రథమ ప్రాధాన్యతనిచ్చారని తెలిపారు. అన్నా చెల్లెలు, అక్క తమ్ముళ్ల అనుబంధానికి రాఖీ పౌర్ణమి నిదర్శనమన్నారు.ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్కు తన సోదరి శ్రీదేవి రాఖీ కట్టి మిఠాయిలు తినిపించారు.