Jogulamba Gadwal | జోగులాంబ గద్వాల : అలంపూర్లోని చారిత్రాత్మక జోగులాంబ ఆలయాన్ని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సందర్శించారు. ఆలయం వద్ద జరుగుతున్న మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు.
భక్తుల సౌకర్యార్థం టూరిజం డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఫుడ్ కోర్టులు, అన్నదానం సత్రాలు, టాయిలెట్ బ్లాక్స్, బంకెట్ హాల్, క్యాంటీన్, 21 గెస్ట్ రూమ్స్, ఆలయంలో విద్యుద్దీపాలంకరణ పనులను చేపట్టారు. రూ. 50 కోట్లతో ఈ మౌలిక సదుపాయాలను చేపట్టినట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. పార్కుల ఏర్పాటు, సుందీకరణ పనులు, తుంగభద్ర ఘాట్ పనులను ఆగస్టు నాటికి పూర్తి చేసి, ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని అధికారులను శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గద్వాల కలెక్టర్ వల్లూరి క్రాంతి, టీఎస్ టీడీసీ చైర్మెన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.