హైదరాబాద్: మన్యం వీరుడు, భారత స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు (Alluri Sitarama raju) చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Minister Srinivas goud) అన్నారు. సీతారామరాజు జయంతి, వర్ధంతి కార్యక్రమాలను తెలంగాణ (Telangana) ప్రభుత్వం తరఫున నిర్వస్తామని చెప్పారు. ఆయన 125వ జయంతి ఉత్సవాలను రవీంద్రభారతిలో (Ravindra Bharathi) ఘనంగా ప్రారంభించామన్నారు. సీతారామరాజు 99వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని ట్యాంక్బండ్పై ఉన్న ఆయన విగ్రహానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. హైదరాబాద్లో అల్లూరి సీతారామరాజు విగ్రహ ఏర్పాటుకు సంబంధించి స్థలాన్ని కేటాయించమన్నారు. రాష్ట్రాలు వేరైనా ప్రజల మధ్య స్నేహపూర్వక సత్సంబంధాలు కొనసాగుతున్నాయని చెప్పారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, క్షత్రియ సేవా సమితి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అధ్యక్షుడు నాగరాజు, ఉపాధ్యక్షుడు రఘురామరాజు తదితరులు పాల్గొన్నారు. సీతారామరాజుపై రూపొందించిన ఆడియో గీతాన్ని మంత్రి ఆవిష్కరించారు.