మహబూబ్నగర్ : గ్రామీణ మండలం కోటకదిర జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో అక్షయపాత్ర ద్వారా మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన తర్వాత విద్యార్థులతో కలిసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ సహపంక్తి భోజనం చేశారు.
ఈ క్రమంలో శివాని అనే తొమ్మిదో తరగతి విద్యార్థినికి మంత్రి గోరుముద్దలు తినిపించారు.
ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించినందుకు శివాని.. మంత్రికి కృతజ్ఞతలు తెలిపింది.
విద్యార్థిని చురుగ్గా, ధైర్యంగా మాట్లాడటం గమనించిన మంత్రి గోరు ముద్దులు తినిపించి చక్కగా చదువుకొని డాక్టర్ అవ్వాలన్నారు. కష్టపడి చదివితే అన్ని విధాలా అండగా ఉంటామని ఆశీర్వదించారు.