Minister Srinivas Goud | పాలసీతోనే కీడ్రల్లోనే తెలంగాణ నెంబర్వన్ స్థానంలో నిలిచిందని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. తెలంగాణతోపాటు, ఏపీ, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్కు చెందిన 15 మంది క్రీడాకారులు జూన్ 29 నుంచి జూలై ఒకటో తేదీ వరకు అమెరికాలో జరగనున్న ప్రపంచ ఓపెన్ కరాటే చాంపియన్షిప్నకు ఎంపికయ్యారు. ఇందులో భాగంగా థాయిలాండ్, మలేషియాలో వారం పాటు జరిగే సన్మాహక శిబిరానికి తరలివెళ్తున్న 18 మంది కరాటే బృందం సభ్యులను బుధవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్గౌడ్ అభినందించారు.
కోచ్ రవి, కెప్టెన్ లక్ష్మి, తెలంగాణకు చెందిన సహదేవ్, సాజిదా, రవితో సహా 15 మంది క్రీడాకారులను సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్ క్రీడలకు ప్రోత్సాహం అందిస్తున్నారని తెలిపారు. శిక్షణా శిబిరాన్ని సద్వినియోగం చేసుకొని పతకాలు సాధించి దేశం గర్వపడేలా కీర్తిప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఎందరో క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటారన్నారు. నిఖత్ జరీన్ అంతర్జాతీయ స్థాయిలో చాంపియన్గా నిలవగా డీఎస్పీ స్థాయి ఉద్యోగం, జూబ్లీహిల్స్లో రూ.20 కోట్ల విలువైన 600 గజాల ఇంటి స్థలం అందించినట్లు మంత్రి తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, ముడా చైర్మన్ గంజి వెంకన్న, నాయకులు పాల్గొన్నారు.