అమరావతి : ఏపీలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ( Road Accident ) లో నలుగురు మృతి చెందగా మరో ఏడుగురికి గాయాలయ్యాయి. మార్కాపురం( Markapuram ) జిల్లా గిద్దలూరు నల్లబండకు చెందిన 14 మంది బంధువులు కంభంలో పెళ్లికి ఆటోలో వెళ్తుండగా రోడ్డుపక్కన ఆలయంలో పూజ కోసం ఆటోను నిలిపారు.
అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఆటోను ఢీ కొట్టడంతో అంకాలు (22), నగేశ్ (18), అలకనంద (18) అనే ముగ్గురు స్పాట్లోనే మృతి చెందగా, చిన్నారి నాగలక్ష్మి( 4) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. మరో ఏడుగురికి గాయాలు కాగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది .
ఈ ప్రమాదంలో పెళ్లికుమార్తె వీరక్క స్వల్ప గాయాలతో బయటపడింది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా గుర్తించారు. వివాహ కార్యక్రమానికి కొన్ని గంటల ముందే ప్రమాదం జరగడంతో ఆ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది.