హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్తో దేశ భవిష్యత్ మారిపోతోందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఒక ప్రయోగశాల అని పేర్కొన్నారు. రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ అనంతరం అద్భుతమైన అభివృద్ధి జరుగుతుందన్నారు. దేశం బాగుపడాలని సీఎం కేసీఆర్ తపిస్తున్నారు. తినడానికి తిండి లేక వడ్లు దిగుమతి చేసుకున్న రోజులను ఈ దేశంలో చూశాం. ఇవాళ తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. దేశం బాగు పడాలనేదే కేసీఆర్ తపన. ఉచిత కరెంట్ కోసం దేశం ఎదురు చూస్తోంది. వ్యవసాయ రంగంలో అద్భుతాలు సృష్టించేందుకు కేసీఆర్ కృషి చేస్తున్నారు. మా నాయకుడితో దేశ భవిష్యత్ మారిపోతోంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు అధికార ధ్యాస తప్ప ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. ఇవాళ కేసీఆర్ నేనున్నాను అని బయల్దేరిండు. దేశ ప్రజల మద్దతు టీఆర్ఎస్కు తప్పకుండా ఉంటుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు.