మహబూబ్నగర్: దేశంలోని ప్రతిఒక్కరు అంబేద్కర్ (Ambedkar) అడుగుజాడల్లో నడవాల్సిన అవసరం ఉందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Minister Srinivas goud) అన్నారు. నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంటు భవనం (Parliament) సెంట్రల్ విస్టాకు కూడా బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని దేశమంతా విజ్ఞప్తి చేసినా కేంద్రంలోని బీజేపీ (BJP) ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా పాత పాలమూరులో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ..
సీఎం కేసీఆర్ (CM KCR) తెలంగాణ సచివాలయానికి (Telangana secretariat) అంబేద్కర్ పేరు పెట్టడమే కాకుండా ఆ మహనీయుని 125 అడుగుల ఎత్తు విగ్రహాన్ని (Ambedkar statue) రాజధాని నడిబొడ్డున ఏర్పాటు చేయించారని తెలిపారు.
మహబూబ్ నగర్లో పాత పాలమూరు మొదట ఏర్పడిందని చెప్పారు. అయితే ఈ ప్రాంత అభివృద్ధిని సమైక్య పాలకులు ఏమాత్రం పట్టించుకోలేదు విమర్శించారు. పట్టణంలో అభివృద్ధి చెందని కాలనీలు శివారు ప్రాంతాలను తమ హయాంలో అద్భుతంగా తీర్చిదిద్దుతున్నామని వెల్లడించారు. అనంతరం హైదరాబాద్లో అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తున్న బస్సులను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. కార్యకర్తలు, అంబేద్కర్ అభిమానులతోపాటు ఆయన కూడా బస్సులోనే హదరాబాద్ బయల్దేరారు.