మహబూబ్నగర్ : ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మరోసారి తన సేవాగుణాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని హన్వాడ మండలం కారం తండ గ్రామానికి చెందిన నిరుపేద గిరిజన కుటుంబానికి చెందిన ఎస్. ప్రీతి, తన తండ్రి శంకర్ నాయక్ చనిపోయి ఆర్థికంగా ఇబ్బందులున్నా ఎంతో కష్టపడి NEET లో ర్యాంక్ సాధించింది. కాగా, మెడికల్ కాలేజీ ఫీజ్ కట్టలేని దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతుండగా.. సమాచారం అదుకున్న మంత్రి గత సంవత్సరం నుంచి మెడిసిన్ కోర్సుకు అవసరమైన కాలేజ్ ఫీజ్ను చెల్లిస్తూ అండగా నిలిచారు. కాగా, తన కాలేజీ ఫీజు చెల్లించి అండగా నిలిచిన మంత్రికి ప్రీతి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.