హైదరాబాద్ : శంషాబాద్ మండలం ముచింతల్లో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చిన్న జీయర్ స్వామిని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి 2 నుండి 14 వ తేదీ వరకు జరుగనున్న శ్రీ రామానుజ చార్యుల సహస్రాబ్ది సమరోహము కార్యక్రమానికి స్వామి వారు శ్రీనివాస్గౌడ్ను ఆహ్వానించారు.
అనంతరం ముచ్చింతల్ ఆశ్రమంలో రామాముజుడి సహస్రాబ్ది ఉత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న యాగశాలలో 1035 కుండ శ్రీలక్ష్మీ నారాయణ మహాక్రతువు, 108 దివ్యదేశ ప్రతిష్ఠ, కుంభాభిషేకము, స్వర్ణమయ శ్రీరామానుజ ప్రతిష్ఠ కార్యక్రమాల పనులను మంత్రి పరిశీలించారు.