మహబూబ్ నగర్ : అన్ని కులాలు, మతాలను సమానంగా చూసే వ్యక్తి మంత్రి శ్రీనివాస్ గౌడ్, అలాంటి వ్యక్తిని హత్య చేసేందుకు బీజేపీ నాయకులు కుట్రపన్నడం దారుణమని జిల్లా రెడ్డి సంఘం నాయకులు అన్నారు.
మహబూబ్ నగర్ జిల్లా రెడ్డి సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో మంత్రి పై జరిగిన హత్య కుట్రకు నిరసనగా మీడియా సమావేశంలో రెడ్డి నాయకులు మాట్లాడారు.
మంత్రి జిల్లా అభివృద్ధి కోసం రేయింబవళ్లు కష్టపడుతున్నారని పేర్కొన్నారు. అలాంటి వ్యక్తిని అంతమొందించాలని కుట్రపన్నడం హేయమైన చర్యగా అభివర్ణించారు. నిందితులకు ఆవాసం కల్పించిన బీజేపీ నేత జితేందర్ రెడ్డి కూడా చట్ట ప్రకారం నిందితుడే అన్నారు. అకామిడేషన్కు షెల్టర్కు తేడా ఏంటో చెప్పాలని వారు డిమాండ్ చేశారు.
కిడ్పాప్ జరిగిందని ధర్నాలు చేసేది మీరే.. వాళ్లకు షెల్టర్ ఇచ్చేది మీరే.. అరెస్ట్ జరిగిందని నిందితులను గురించి మాట్లాడుతుంది మీరే అని బీజేపీ నేతల తీరును విమర్శించారు. రెడ్డి సంఘం తరపున ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కార్యక్రమంలో స్వర్ణ సుధాకర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, మల్లు నర్సింహ రెడ్డి,అనంత్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, వెంకటేశ్వరమ్మ, అనిత ,పాండు రంగా రెడ్డి,తిరుపతి రెడ్డి , రాజేశ్వర్ రెడ్డి, అనంత్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.