గ్రంథాలయ పరిషత్ జిల్లా చైర్మన్ ఆకునూరి శంకరయ్య
ముగిసిన కబడ్డీ క్యాంప్
సిరిసిల్ల రూరల్, మార్చి 29: కబడ్డీ పోటీల్లో జిల్లాను అగ్రస్థానంలో ఉంచాలని గ్రంథాలయ పరిషత్ జిల్లా చైర్మన్ ఆకునూరి శంకరయ్య పిలుపునిచ్చారు. తంగళ్లపల్లి మండలం కేంద్రంలోని చైతన్య పాఠశాలలో సోమవారం కబడ్డీ క్యాంపు ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నెల 31నుంచి ఏప్రిల్ 2 వరకు మేడ్చల్ జిల్లా బొడుప్పల్లోని బృందావన్ గార్డెన్లో నిర్వహించే అంతర్రాష్ట్ర కబడ్డీ పోటీలకు జిల్లా నుంచి మహిళా, పురుషుల జట్లను ఎంపిక చేశారు. కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు తోట రామ్కుమార్తో కలిసి ఆకునూరి శంకరయ్య ఇరు జట్లకు కబడ్డీ కిట్లను అందజేశారు. క్రీడాకారు లు పోటీల్లో సత్తా చాటి పథకాలు సాధించాలని ఆకాంక్షించారు. క్రీడలతోనూ ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు. ఇక్కడ కబడ్డీ జిల్లా కార్యదర్శి సింగారపు తిరుపతి, మండలాధ్యక్షులు కోడి అంతయ్య, బొడ్డు నారాయణ, గిరిజన డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రజిని, వైస్ ప్రిన్సిపాల్ సదానందం, రెఫరీ బోర్డు చైర్మన్ ప్రభాకర్, టీఆర్కే ట్రస్ట్ సభ్యుడు మహేశ్, జాయింట్ సెక్రటరీ ముస్తఫా, రవికుమార్, పీఈటీలు పాల్గొన్నారు.
పురుషుల జట్టు: వెంకటేశ్, ప్రశాంత్, జలేందర్, ప్రశాంత్, అనిల్, సాగర్, సాయికుమార్, తరుణ్, ఖాజా, రాజు, సుధాక ర్, శివరాం, మహిళల జట్టు: కావ్య, అపర్ణ, రక్షిత, రసజ్ఞ, సానా, వర్షిణి, శిరీష, నిఖిత, గంగరాణి, అనిత, అనూష, శిరీష తది తరులు జట్టుకు ఎంపికయ్యారు.