హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో మహిళా సంఘాలకు పెద్దపీట వేశామని మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుత యాసంగిలో రాష్ట్రవ్యాప్తంగా 8,251 సెంటర్లు ఏర్పాటు చేయనుండగా, ఇందులో 3,403 (40శాతం) సెంటర్లను సమాఖ్య సంఘాలకు కేటాయించినట్టు వెల్లడించారు.
అతివల సుస్థిర ఆర్థికాభివృద్ధికి కాంగ్రెస్ సర్కార్ కృషి చేస్తున్నదని స్పష్టంచేశారు. సెర్ప్ సీఈవో దివ్యాదేవరాజన్ మాట్లాడుతూ.. ఐకేపీ సెంటర్ల నిర్వహణలో మహిళా సంఘాలు చూపుతున్న నిబద్ధత, పారదర్శకతతో రైతుల్లో విశ్వాసాన్ని పెంచాయని తెలిపారు.