హైదరాబాద్, మే 16(నమస్తే తెలంగాణ) : స్త్రీనిధిలో ఒకరినీ కూడా తీసివేయలేదని, ఉద్యోగాల తొలగింపు అనేది అబద్ధమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక స్పష్టంచేశారు. ప్రభుత్వాన్ని, సంస్థను బదనాం చేసేందుకు కొందరు చేస్తున్న అసత్య ప్రచారాలను ఎవరూ నమ్మొద్దని, సంస్థను బలోపేతం చేయడమే తమ ప్రభుత్వ ఏకైక లక్ష్యమని పేర్కొన్నారు. ఇప్పటికే సంస్థలో ఉద్యోగోన్నతులు, బదిలీల ప్రక్రియ పూర్తి చేశామని, సెర్ప్లో కూడా బదిలీలు పారదర్శకంగా జరిగాయని చెప్పారు. ప్రజాభవన్లో శనివారం స్త్రీనిధి వార్షిక కార్యాచరణ ప్రణాళిక అమలు కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా మాట్లాడారు.
కొత్తగా ఏర్పాటైన స్త్రీనిధి స్టాఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ను మంత్రి అభినందిస్తూనే, సంఘాలు హకుల కోసమే కాకుండా, బాధ్యతలను కూడా గుర్తుచేసేలా ఉండాలని చెప్పారు. ఇప్పటివరకు స్త్రీనిధి ద్వారా 32లక్షల మందికిపైగా మహిళలకు రూ.24వేల కోట్ల రుణాలు అందించడం గొప్ప విజయమని.. ఇది అసలు సిసలు మాహిళా బ్యాంక్ అని సీతక్క కొనియాడారు. తెలంగాణ స్త్రీనిధి మాడల్ను ఇతర రాష్ర్టాలు కూడా అనుసరిస్తున్నాయని తెలిపారు. త్వరలో ఉద్యోగ విరమణ చేయనున్న ఎండీ విద్యాసాగర్రెడ్డిని మంత్రి సీతక, ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. డిప్యూటీ ఎండీ శ్రీనాథ్ నూతన నాయకత్వంలో సంస్థ మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. కార్యక్రమంలో స్పెషల్ సీఎస్ దాన కిశోర్, పంచాయతీరాజ్ కమిషనర్ దివ్యదేవరాజన్, డిప్యూటీ ఎండీ శ్రీనాథ్తో పాటు ఉద్యోగులు పాల్గొన్నారు.