హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): తెలుగు సాహిత్యం గిరిజన గడపలు, బంజారాల జీవితాల దగ్గరకు రావటం సాహిత్యరంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులకు నిదర్శనమని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో వెలువడిన తొలి బంజార కథల సంకలనం ‘కేసులా’ పుస్తకాన్ని సోమవారం హైదరాబాద్లో ఆమె ఆవిష్కరించారు.
‘కేసులా’ అంటే మోదుగు పూలని, ప్రకృతితో పెనవేసుకున్న గిరిజనుల జీవితాలను అద్భుతంగా ఈ కథల్లో నిక్షిప్తం చేశారని ఆమె చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్, పుస్తక సంపాదకుడు డాక్టర్ సూర్యాధనుంజయ్, రమేశ్ కార్తీక్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.