వరంగల్ రూరల్ : నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పరామర్శించారు. ఎమ్మెల్యే తండ్రి రాజిరెడ్డి అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా, శుక్రవారం నల్లబెల్లి మండల కేంద్రంలో రాజిరెడ్డి చిత్రపటం వద్ద మంత్రి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. మంత్రి వెంట ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య తదితరులు ఉన్నారు.