వరంగల్ : ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు, బోగి పండగ పురస్కరించుకుని మంత్రి సత్యవతి రాథోడ్ స్వామి వారిని దర్శించుకున్నారు. మంత్రితో పాటు ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే అరూరి రమేష్, జెడ్పీ చైర్మన్ సుధీర్ బాబు, మేయర్ గుండు సుధారాణి, మంత్రి కుటుంబ సభ్యులు కలిసి స్వామిని దర్శించుకుని, పూజలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..కరోనా, ఒమిక్రాన్ ఉన్నా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రజలు సుఖ, సంతోషాలతో ఉండాలని సీఎం కేసిఆర్ నాయకత్వంలో ప్రజలకు మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు కావాలని ఈ పర్వదినాన భగవంతుణ్ణి దర్శించి, ప్రార్థించామన్నారు.
తెలంగాణను ఏ రంగంలో చూసినా తెలంగాణ ఏర్పాటు ముందు, తరవాత అన్నది స్పష్టంగా కనిపిస్తుంది. పురాతనమైన ఆలయాల విశిష్టత కాపాడుతూ అక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు కల్పిస్తూ..దేవాలయాలను సీఎం కేసీఆర్ గొప్పగా అభివృద్ధి చేస్తున్నారని ప్రశంసించారు.
రాబోయే మేడారం జాతర కోసం కూడా పకడ్బందీగా చర్యలు చేపడుతున్నామని వివరించారు.
కొంతమంది పసలేని నాయకులు ప్రజలు వారిని స్వీకరించడం లేదని, దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి బీజేపీ నేతలను పిలిపించుకుని సీఎం కేసీఆర్ పై పసలేని విమర్శలు చేస్తున్నారు.
ఇలాంటి నేతలకు మంచి బుద్ధి, జ్ఞానం ప్రసాదించాలని దేవుడిని వేడుకున్నామని తెలిపారు.