హైదరాబాద్ : జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ఈ నెల 17న ఆదివాసీ, బంజారా ఆత్మగౌరవ భవనాలను రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ప్రారంభ కార్యక్రమాల నిర్వహణపై మంత్రి సత్యవతి రాథోడ్ సమీక్ష నిర్వహించారు. గిరిజన, ఆదివాసీ, ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమయ్యారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, సభ ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ నెల 17న పీపుల్స్ ప్లాజా నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు ఊరేగింపు నిర్వహించనున్నట్లు తెలిపారు. గిరిజన, ఆదివాసీల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గిరిజన, ఆదివాసీల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు.