హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ)/ఖైరతాబాద్: గిరిజనుల పక్షపాతి సీఎం కేసీఆర్ అని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కొనియాడారు. కేసీఆర్ పాలనతోనే గిరిజనుల బతుకుల్లో వెలుగులు నిండాయని చెప్పారు. ఖైరతాబాద్లోని విశ్వేశ్వరయ్యభవన్లో ఆదివారం నిర్వహించిన జాతీ య బంజారా మీట్-2023లో సత్యవతిరాథో డ్ మాట్లాడారు. తెలంగాణలో కేసీఆర్ పాలన ఆదివాసీ, గిరిజనులకు స్వర్ణ యుగమని తెలిపారు. గిరిజనుల బతుకుల్లో సమూల మార్పు లు తీసుకొచ్చిన సీఎం కేసీఆర్ను గిరిజన జాతి మరువబోదని చెప్పారు.తెలంగాణలో 3,144 తండాలను గ్రామ పంచాయతీలుగా చేశారని, రూ.2వేల కోట్లతో గిరిజన ఆ వాసాలకు రోడ్లు వేయించారని గుర్తుచేశారు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ల అమలుతో విద్య, ఉద్యోగవకాశాలు పెరిగాయని తెలిపారు.
ఢిల్లీలోనూ బంజారాభవన్ నిర్మించాలి
అధికారంలోకి వస్తే ప్రతి తండాలో గుడి కట్టిస్తామని బీజేపీ నేతలు చెప్తున్నారని, ముందు హైదరాబాద్లో మాదిరిగానే ఢిల్లీలోనూ బంజారాభవన్ నిర్మించాలని మంత్రి సత్యవతి రాథోడ్ డిమాండ్ చేశారు. సేవాలాల్ జయంత్యుత్సవాలను దేశవ్యాప్తంగా అధికారికంగా నిర్వహించాలని సూచించారు. దేశంలో 14 కోట్ల మంది గిరిజనులు మాట్లాడుతున్న లంబాడీ భాషను ఎనిమిదో షెడ్యూల్లో చేర్చి అధికారిక భాషగా కేంద్రం గుర్తించాలని కోరారు. 15 రాష్ర్టాల బంజారా మేధావులు, సామాజిక కార్యకర్తలు, అధికారులు, యువకులు హాజరయ్యా రు. సమావేశంలో ట్రైకార్ చైర్మన్ రామచంద్రునాయక్, జీసీసీ చైర్మన్ వాల్యానాయక్, మాజీ ఎంపీ సీతారాంనాయక్, అఖిల భారత బంజారా జేఏసీ ప్రెసిడెంట్ సింపల్బాయ్ రాథోడ్, రాష్ట్ర ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ బీ రమణానాయక్, కో చైర్మన్ రాంబాల్నాయక్, కో ఆర్డినేటర్లు ధనంజయ్నాయక్, రాంబాబునాయక్, రూపసింగ్ ధరావత్, గాంధీనాయక్, తిరుపతినాయక్, డాక్టర్ రవితేజ పాల్గొన్నారు.
జాతీయ బంజారా మీట్-2023లో చేసిన తీర్మానాలు ఇవే..