మహబూబాబాద్ : అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు అధైర్యపడ వద్దని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్(Minister Satyavati Rathode) రైతులకు భరోసా కల్పించారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం శ్రీరామగిరి లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ(Sudden Visit) చేశారు .
ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు(Grain Procurement) కేంద్రం వద్ద ఆమె రైతులతో మాట్లాడారు.అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన ధాన్యాన్ని సేకరించాలని, తేమ పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దని అధికారులను ఆదేశించారు.