మహబూబాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలుగా నియామకమైన మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవితకు రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్లోని తన నివాసంలో కవితకు పూలబొకే అందించి శుభాకాంక్షలు తెలిపారు. మహబూబాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ను తిరుగులేని రాజకీయ శక్తిగా మార్చేందుకు నూతన అధ్యక్షురాలు కృషి చేయాలని తెలిపారు. 24 గంటలు జిల్లాలో అందుబాటులో ఉంటూ పార్టీ నేతలు, కార్యకర్తలను సమన్వయం చేసి పార్టీని పటిష్టపరచాలన్నారు. జిల్లాల అధ్యక్షుల నియామకంతో పార్టీలో కొత్త ఉత్సాహం నెలకొన్నదని.. దీనిని క్షేత్ర స్థాయికి విస్తరించి, కార్యకర్తల్లో ఉత్తేజాన్ని నింపే విధంగా నూతన అధ్యక్షులు పనిచేయాలన్నారు.