హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): మహబూబాబాద్ జిల్లా మల్యాల గ్రామంలోని కృషి విజ్ఞాన్ కేంద్రం (కేవీకే)కి అనుబంధంగా హార్టికల్చర్ డిగ్రీ కళాశాల మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్కు గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్ ధన్యవాదాలు తెలియజేశారు.
రాష్ట్రంలోనే తొలి హార్టికల్చర్ డిగ్రీ కాలేజీ మహబూబాబాద్ జిల్లాకు మంజూరు కావడం చాలా సంతోషంగా, గర్వంగా ఉన్నదని చెప్పారు. మారుమూల ప్రాంతాల విద్యార్థులను అన్ని రంగాల్లో ప్రోత్సహించడంతోపాటు గిరిజనులు అధికంగా ఉండే మహబూబాబాద్ జిల్లాను మరింత అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కీలక సంస్థలను కేసీఆర్ మంజూరు చేశారని పేర్కొన్నారు.