హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అంగన్వాడీలకు అండగా నిలిచిందని స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమశాఖల మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా అంగన్వాడీ టీచర్లు, సహాయకుల వేతనాలను పెంచిన ఘనత సీఎం కేసీఆర్దేనని కొనియాడారు. అయినా, కొన్ని అంగన్వాడీ యూనియన్లు ఉద్దేశపూర్వకంగా ధర్నాలకు దిగుతాయన్న సంకేతాలపై మంత్రి శుక్రవారం రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ కార్యదర్శి భారతి హొలికెరి, అన్ని జిల్లాల సంక్షేమ అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఏవైనా చిన్నచిన్న సమస్యలు ఉంటే అంగన్వాడీ యూనియన్లతో చర్చించి, వారి డిమాండ్లు తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమ్మెబాటతో సమస్యలు పరిషారం కావని, వినతిపత్రం ద్వారా సమస్యలు పరిషరిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు పలువురు అంగన్వాడీ టీచర్లు ఇప్పటికే కృతజ్ఞతలు తెలిపిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. ప్రస్తుతం మెయిన్ అంగన్వాడీ కేంద్రాల టీచర్లకు నెలకు రూ.13,650, మినీ అంగన్వాడీ టీచర్లు, సహాయకులకు రూ.7,800 వరకు రాష్ట్ర సరార్ వేతనాలను పెంచిందని పేరొన్నారు. మినీ అంగన్వాడీల సేవలను గుర్తించి, మెయిన్ అంగన్ వాడీ కేంద్రాలుగా అప్గ్రేడ్ చేసిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. అంగన్వాడీలను వర్కర్లు అనకుండా టీచర్లుగా సంబోధించాలని ఆదేశాలిచ్చి, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 30 శాతం పీఆర్సీ పెంచామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారత, సమగ్రసేవల, రక్షణ, పోషణ, ఆరోగ్యం కోసం దేశంలోనే అత్యుత్తమంగా పనిచేస్తున్నదని మంత్రి వివరించారు.