వరంగల్ : ఈ నెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని నర్సంపేటలో ఏర్పాటు చేసిన కబడ్డీ పోటీల్లో టీఆర్ఎస్ పార్టీ మహిళా నేతలు పాల్గొని ఆడారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోత్ కవిత ఒక టీంలో ఉండగా, వరంగల్ రూరల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి మరో టీం తరపున ఆడారు. వీరు కబడ్డీ ఆడుతున్నంత సేపు గ్రౌండ్ అంతా కేరింతలతో మార్మోగింది. మంత్రి సత్యవతి రాథోడ్ కబడ్డీ ఆడి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు.