CM KCR | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ నెల 27న మహబూబాబాద్లో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్తో కలిసి సభాస్థలిని పరిశీలించారు. 70వేల మందితో ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ సభ నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు.
మహబూబాబాద్ జిల్లా అభివృద్ధి ప్రదాత ముఖ్యమంత్రి కేసీఆర్ రాక కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. ఓ కుగ్రామంగా ఉన్న మహబూబాబాద్ను సీఎం కేసీఆర్ ఆశీస్సులతో జిల్లా ఏర్పాటు చేసుకొని అన్నివిధాలా అభివృద్ధి చేసుకున్నామన్నారు. ఎమ్మెల్యేగా శంకర్ నాయక్ గెలుపు ఖాయమన్నారు. ప్రజల కష్ట సుఖాలు తెలిసిన నేత.. ప్రతిపక్షాల రోగం కుదిర్చే నేత కేసీఆర్ అన్నారు.
కాంగ్రెస్, బీజేపీ అధికారం కోసం పుట్టిన పార్టీలని.. పేద ప్రజలకు అండదండగా ఉన్న పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనన్నారు. 60ఏళ్ల పాలనలో కాంగ్రెస్ దేశాన్ని, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందని.. కేంద్రంతో సహా 19 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే కల్లబొల్లి మాటలు చెప్పి ప్రజలను మోసం చేయడమే కాంగ్రెస్, బీజేపీ నైజమని, ఆ పార్టీలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.