మహబూబాబాద్: మంత్రి సత్యవతి రాథోడ్ (Minister Satyavathi Rathod) మరోసారి మానవత్వం చాటుకున్నారు. ఆదివారం ఉదయం మంత్రి సత్యవతి తన కాన్వాయ్లో మహబూబాబాద్ నుంచి హైదరాబాద్కు పయణమయ్యారు. ఈ క్రమంలో తొర్రూరు ప్రధాన రహదారిపై బైక్పై వెళ్తున్న ఓ వ్యక్తి ఫిట్స్ రావడంతో కిందపడిపోయారు. అదే ఆ మార్గం గుండా వెళ్తున్న మంత్రి.. అతడిని గమనించారు. వెంటనే తన కాన్వాయ్ని పక్కకు ఆపి అతడిని పరామర్శించారు. తీవ్రంగా గాయపడిన అతడికి సపర్యలు చేశారు. వెంటనే అంబులెన్సును పిలిపించి సమీపంలోని దవాఖానకు తరలించారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు.