గోవిందరావుపేట, నవంబర్ 4: రాష్ర్టాన్ని 50 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ గిరిజనుల సంక్షేమాన్ని పట్టించుకోకుండా ద్రోహం చేసిందని, మోసపూరిత హామీలకు ఆ పార్టీ కేరాఫ్ అడ్రస్ అని మంత్రి సత్యవతిరాథోడ్ విమ ర్శించారు. శనివారం ములుగు జిల్లా గోవిందరావుపేటలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పోరిక గోవింద్నాయక్ అధ్యక్షతన నిర్వహించిన బంజారాల ఆత్మీయ సమ్మేళనం లో ఎంపీ మాలోత్ కవితతో కలిసి పాల్గొన్నా రు. మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని గిరిజనులు, ఆదివాసీలు, బంజారాల సమగ్రాభివృద్ధికి సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ 50 ఏండ్ల పాలనలో బంజారాలకు చేసింది శూన్యమని దుయ్యబట్టారు. కేసీఆర్ పాలనలో ములుగు జిల్లా ఏర్పాటు చేసుకొని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు. ములుగు నియోజకవర్గ అభ్యర్థి నాగజ్యోతిని ప్రజలు, బంజారాలు ఆదరించి అధిక మెజార్టీతో గెలిపించాలని మంత్రి కోరారు.