బంజారాల సంప్రదాయ పండుగ తీజ్ వేడుకల్లో ఆదివారం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆడి పాడి సందడి చేశారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం బాల్య తండాలో జరిగిన వేడుకల్లో జడ్పీ చైర్మన్ అంగోత్ బిందు, ఎంపీ మాలోత్ కవిత, ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియా నాయక్తో కలిసి మంత్రి డాన్స్ చేశారు. తొలుత శివ పార్వతుల విగ్రహాలకు పూజలు నిర్వహించారు. తీజ్ బుట్టలను గ్రామంలో ఊరేగించిన
అనంతరం చెరువులో నిమజ్జనం చేశారు.