మహబూబాబాద్: టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్కు మంత్రి సత్యవతి రాథోడ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు. మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ముత్యాలమ్మ ఆలయంలో ఎంపీ కవితతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ మరింత శక్తివంతులై రాష్ట్రానికి సేవలు చేయాలని ఆకాంక్షించారు. ఏ పదవి తీసుకున్నా దానికి వన్నె తెచ్చేలా పనిచేస్తున్నారని, సమయస్ఫూర్తి, మేధస్సుతో అభివృద్ధిపథం వైపు నడిపిస్తున్నారని చెప్పారు.
తెలంగాణ కీర్తిని చాటిచెప్పే నాయకుడు కేటీఆర్ అని వెల్లడించారు. శనివారం రాత్రి కేటీఆర్ కాలుకు గాయమైందని, దానినుంచి త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నాని చెప్పారు.