హైదరాబాద్ : ఆదిమ గిరిజన సంక్షేమ సలహా కమిటీ, ఉట్నూరు(ఐటిడిఏ)కు చైర్మన్గా బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించనున్న ఆదివాసి ముద్దుబిడ్డ కనక లక్కేరావుకు రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ ఏ నమ్మకంతో ఈ నియామకం చేశారో, ఆ నమ్మకం నిలబెట్టే విధంగా పని చేయాలన్నారు.
ఆదివాసీల అభ్యున్నతికి కృషి చేయాలని సూచించారు. ఆదివాసీల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వారికి సమర్థవంతంగా చేరవేయాలన్నారు. ఆదివాసీల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తే వాటి పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు.