మహబూబాబాద్ : జిల్లాలోని గూడూరు మండల పొనుగొడు గ్రామ సర్పంచ్ నలమాస వెంకన్న గౌడ్ నిన్న రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్(Minister Sathyavathi Rathord) శుక్రవారం వెంకన్న స్వగృహానికి చేరుకొని ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి వారిలో మనోధైర్యాన్ని నింపారు. అధైర్య పడొద్దు అండగా ఉంటామన్నారు.
బీఆర్ఎస్ పార్టీ ఒక గొప్ప నాయకుడుని కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. వెంకన్నతో తనతో ఉన్న సన్నిహిత్యాన్ని గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకున్నారు. వెంకన్న లాంటి నిస్వార్థ రాజకీయా నాయకుడు చాలా అరుదు అని అన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఆరె వీరన్న, బీఆర్ఎస్ నాయకులు బీరవేల్లి భరత్ కుమార్ రెడ్డి, మర్రి రంగ రావు, పర్కాల శ్రీనివాస్ రెడ్డి, జడ్పీ కో ఆప్షన్ మహబూబ్ పాషా, బొడ్డుగొండ సర్పంచ్ లక్ష్మణ్ రావు, జలగం సంపత్, తదితరులు పాల్గొన్నారు.