రంగారెడ్డి : బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 18,19 వార్డు కౌన్సిలర్లు కెంచె లక్ష్మీనారాయణ, పల్లపు శంకర్ ఆధ్వర్యంలో శ్రీరామకాలనీకి చెందిన సోమవంశ సహస్రజున క్షత్రియ(ఖత్రి) సంఘానికి చెందిన 120 మంది కుటుంబ సభ్యులు మంగళవారం మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ (BRS) లో చేరారు.ఈ సందర్భంగా వారికి మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఆమె మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని పేర్కొన్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రంలో అమలవుతున్నాయని వివరించారు. తెలంగాణలోని నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో మునుపెన్నడూ లేని విధంగా మౌలిక వసతులు సమకూరుతున్నాయన్నారు.
సీఎం సహాయనిధిని సద్వినియోగం చేసుకోవాలి..
సీఎం సహాయనిధిని అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సబితాఇంద్రారెడ్డి(sabitha indrareddy) సూచించారు. ఆర్కేపురం డివిజన్కు చెందిన రాజపోచయ్య అనారోగ్య సమస్యతో బాధ పడుతూ స్థానిక బీఆర్ఎస్ నాయకులను సంప్రదించగా వారు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా చికిత్స కోసం ముందస్తుగా ఎల్వోసీ నుంచి రూ.1,25,000 లక్షల చెక్కును బాధితునికి మంత్రి అందజేశారు.
ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తుందన్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్లో వైద్యం చేయించుకోలేనటువంటి ప్రజలకు సీఎం సహాయనిధి ఎంతోగానో ఉపయోగ పడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఆర్కేపురం డివిజన్ అధ్యక్షులు పెండ్యాల నగేశ్, నాయకులు సాజీద్, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.