హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ పాఠశాలు, విద్యాసంస్థల్లో చదివినవారిని తక్కువ చేసి చూడొద్దని, వారిని సానపట్టడం ద్వారా జాతిరత్నాలను వెలికితీయవచ్చని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ విద్యార్థులను ప్రపంచంతో పోటీపడేలా తీర్చిద్దేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఉపాధ్యాయులే సమాజ నిర్మాతలని, అంద రం కలిసి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేద్దామని అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం ట్యాంక్బండ్పై ఉన్న సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహానికి మంత్రులు సబితాఇంద్రారెడ్డి, మహమూద్అలీ పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం విద్యాశాఖ ఆధ్వర్యం లో రవీంద్రభారతిలో గురుపూజోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా సబితారెడ్డి మా ట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో కేజీ టు పీజీ వరకు సమూలమైన మార్పులు చేశామని, అనేక విజయాలు సాధించామని వివరించారు. వెయ్యికి పైగా గురుకులాలను ఏర్పాటు చేసి కేజీ టు పీజీ విద్య సాకారమయ్యే దిశగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల్లో చదువుకున్న ఎస్సీ అమ్మాయిలకు 13 వరకు బహుళజాతి కంపెనీల్లో ఉద్యోగ ఆఫర్లు వచ్చాయని, ఇది మనందరికీ గర్వకారణమని చెప్పారు. మన ఊరు-మన బడి స్ఫూర్తితో ప్రైవేట్స్కూళ్లు సైతం ఇదే తరహాలో వసతులు కల్పించేందుకు పోటీపడుతున్నాయని పేర్కొన్నారు. తల్లిదండ్రుల మాట కంటే గురువుల మాటకు పిల్లలు ఎక్కు వ విలువ ఇస్తారని, ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించినవారు అదృష్టవంతులని చెప్పారు.
పోలీసులు, ఇంజినీర్లను తయారుచేసేది టీచర్లే : మహమూద్ అలీ
రంజాన్, క్రిస్మస్, దీపావళి లాంటి పండుగలను కొంతమంది మాత్రమే జరుపుకుంటారని, కానీ, అన్ని వర్గాలు జరుపుకునే పండుగ గురుపూజోత్సవమని హోంశాఖ మంత్రి మ హమూద్ అలీ అన్నారు. సమాజంలో పోలీసు లు, ఇంజినీర్లు ఇలా ఎవరిని తయారుచేయాలన్నా ఉపాధ్యాయులతోనే సాధ్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, కూర రఘోత్తంరెడ్డి, ఏవీఎన్ రెడ్డి, కార్పొరేషన్ల చైర్మన్లు ఆయాచితం శ్రీధర్, రావు ల శ్రీధర్రెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, వైస్ చైర్మన్లు వెంకటరమణ, ఎస్కే మహమూద్, పాఠశాల విద్య డైరెక్టర్ శ్రీదేవసేన పాల్గొన్నారు. ఈ సందర్భంగా 140 మంది ఉత్తమ టీచర్లు, అధ్యాపకులు, ఆచార్యులను ఘనంగా సన్మానించారు.
గురువుకు మంత్రి ఎర్రబెల్లి పాదాభివందనం
పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు గురుపూజోత్సవం సందర్భంగా మంగళవారం వరంగల్ జిల్లా పర్వతగిరిలో చిన్ననాటి గురువు బొంపెల్లి రంగారావు ఇంటికి వెళ్లారు. ఆయనకు పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకొన్నారు.
– పర్వతగిరి