హైదరాబాద్: టీ న్యూస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అబ్రాడ్ ఎంబీబీఎస్ ఎడ్యుకేషన్ ఫెయిర్ను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఖైరతాబాద్లోని విశ్వేశ్వరయ్య భవన్లో జ్యోతి ప్రజల్వన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి పలు స్టాళ్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విదేశాల్లో వైద్య విద్య అభ్యసించాలని అనుకునే వారికి టీ న్యూస్ వారధిగా నిలుస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమ నిర్వాహకులకు మంత్రి అభినందనలు తెలిపారు.