Sabitha Indra Reddy | వికారాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని( Telangana Govt ) అప్రతిష్టపాటు చేయాలనే ఉద్దేశంతోనే పదో తరగతి ప్రశ్నపత్రాలు( tenth Question papers ) బయటకు తీసుకొచ్చి వైరల్ చేస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి( Minister Sabitha Indra reddy ) పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ భవన్లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు.
టీఎస్పీఎస్సీ( TSPSC ) పేపర్ల లీకేజీ నుంచి పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ వరకు కుట్ర కోణం దాగి ఉందని మంత్రి తెలిపారు. కేంద్రంలోని బీజేపీ పెద్దల పర్యవేక్షణలోనే రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్( Bandi Sanjay ) పేపర్ లీకేజీల కుట్రకు పాల్పడ్డారని మంత్రి పేర్కొన్నారు. మీ స్వార్ధ రాజకీయాల కోసం ఐదు లక్షల మంది విద్యార్ధుల జీవితాలతో చెలగాటం అడుగుతారా..? అని సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. టీఎస్పీఎస్పీ పేపర్ లీకేజీ చేసిన రాజశేఖర్, పదో తరగతి పేపర్ లీకేజీలో పాత్ర ఉన్న ప్రశాంత్లకు బీజేపీ నాయకులతో సంబంధాలు ఉన్నాయన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరులో పదో తరగతి పేపర్ బయటకు తీసుకొచ్చి వైరల్ చేసిన టీచర్ కూడా బీజేపీ అనుబంధ సంఘం సభ్యులు అని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలనుకునేవారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు అని మంత్రి సబితా ఇంద్రారెడ్డి హెచ్చరించారు.