మహేశ్వరం, ఫిబ్రవరి 17: బంజారాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ పలు సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నారని, గిరిజనులకు గిరిజనబంధు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారని విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి తెఇపారు. శుక్రవారం మహేశ్వరంలోని గడికోట ప్రాంగణంలో గిరిజన ఉపాధ్యాయు లు ఏర్పాటు చేసిన సేవాలాల్ మహారాజ్ 284వ జయంత్యుత్సవాల్లో గిరిజన క్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్తో కలిసి పాల్గొన్నారు. ఈ
సందర్భంగా మంత్రి సబిత మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి గిరిజన బతుకుల్లో వెలుగులు నింపారని వెల్లడించారు. రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమాన్ని చూసి కేంద్రం జీర్ణించుకోలేక పోతున్నదని విమర్శించారు. మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఇతర రాష్ర్టాలు ఆదర్శంగా తీసుకొంటున్నాయని తెలిపారు. సీఎం కేసీఆర్ గిరిజనులకు ఆత్మగౌరవ భవనాన్ని కట్టించారని, కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారని వెల్లడించా రు. తెలంగాణను కేంద్రం అన్ని రంగాల్లో చిన్న చూపు చూస్తున్నదని విమర్శించారు. అనంతరం సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్చేసి సంబురాలు చేసుకొన్నారు.