హైదరాబాద్ : విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. శనివారం రోజున మామిడిపల్లి మీదుగా వెళ్తుండగా కాళ్లకు చెప్పులు లేకుండా ఎండలో వెళ్తున్న విద్యార్థులను చూశారు. వెంటనే కాన్వాయ్ ఆపి ఆ పిల్లలను తన దగ్గరకు పిలిచి చాక్లెట్లు, మంచినీళ్లు అందించి.. వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. వెంటనే స్థానిక నేత నిమ్మల నరేందర్ గౌడ్కు ఫోన్ చేసి ఆ చిన్నారులకు షూలు, సాక్స్ జతలు ఇప్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సబితా ఇంద్రారెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.