హైదరాబాద్ : తెలంగాణలో 475 కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు, 194 ఆదర్శ పాఠశాలలు ఏర్పాటు చేసినట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా కేజీబీవీలు, ఆదర్శ పాఠశాలలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమాధానం ఇచ్చారు.
కేజీబీవీలను మరిన్ని ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది అని మంత్రి తెలిపారు. కేజీబీల స్థాయిని పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నాం. ఆదర్శ పాఠశాలలు ఇంటర్మీడియట్ వరకు పని చేస్తున్నాయి. కేజీబీవీల్లో మౌలిక సదుపాయాలను ఎప్పటికప్పుడు అంచనా వేసి కల్పిస్తున్నాం. ఆదర్శ పాఠశాలల్లో సరిపడా మౌలిక సదుపాయాలు ఉన్నాయని పేర్కొన్నారు. లక్షా పది వేల మంది బాలికలు కేజీబీవీల్లో చదువుతున్నారు అని మంత్రి సబితా వెల్లడించారు.